గుండాల జున్ 3(మన్యం మనుగడ) రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ స్థానిక వ్యాపారస్తులకు సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వ్యాపారస్తుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించే వద్దని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించడం వలన రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రైతులతో వ్యాపారస్తులు సత్సంబంధాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, తిరుకొల్లూరి వెంకటేశ్వర్లు, గుమస్తా యక రాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: