మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా, మంగపేట మండలం, రాజుపేట రమణక్క పేట, గ్రామాలలోని పల్లె ప్రగతి పనులను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజుపేట గ్రామ పంచాయతీ లోని తెలంగాణా క్రీడ ప్రాంగణం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా క్రీడా ప్రాంగణం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి అధికారులకు సూచనలు చేశారు. తదనంతరం గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు. రమణక్క పేట గ్రామపంచాయతీ పల్లె ప్రగతి పనులను కూడా తనిఖీ చేపట్టి,పల్లె ప్రగతి ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులతో పాటు ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అధికారులకు పల్లె ప్రగతి పనులను వేగ వంతం చేయాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో పాటు మంగపేట మండలం స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: