హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేటీఆర్ తప్పుపట్టారు.
‘‘వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు.. సీఏఏ ముస్లింలకు అర్థం కాదు.. ఎల్పీజీ ధరలు హోం మేకర్స్ కు అర్థం కాదు.. ఇప్పుడు అగ్నిపథ్ యువతకు అర్థం కాదు.. ఇవన్నీ కేవలం విశ్వగురుకు మాత్రమే తెలియాలి.’’ అని మోడీ ప్రభుత్వ అనాలోచిన విధానాలపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
Post A Comment: