CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రహదారి పర్మిషన్.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూన్ 14:

 ములుగు జిల్లా వాజేడు మండలం చికుపల్లి గ్రామంలో ని బొగత జలపాతం (వాటర్ ఫాల్స్) వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయా రహదారి పర్మిషన్స్ రెవెన్యూ అధికారి గూడూరి, లక్ష్మణ్. ఉత్తర్వులు జారీ చేశారు. 

వాజేడు మండల తహసిల్దార్ వివరణ ఇస్తూ

బొగత జలపాతం తెలంగాణ నయాగరా గా ప్రసిద్ధి చెందింది. జలపాత పక్కనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వెలిశారు. బొగత జలపాతాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు, లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకొని ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులు వీక్షిస్తారు. కానీ కొన్ని దశాబ్దాలుగా నేరుగా దేవస్థానానికి రహదారి సౌకర్యం లేక భక్తులు, పర్యాటక, ప్రియుల ఇబ్బందులను, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కమిటీ సభ్యులు కుంజ రమేష్, సర్పంచ్ కొరం సమ్మక్క, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించారు. వాజేడు మండలం తహాసిల్దార్ గూడూరు, లక్ష్మణ్.కి రహదారినీ సర్వే చేసి ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ఇచ్చారు.

 గత దశాబ్దకాలంపాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి ఫారెస్ట్ అధికారులు అడ్డు చెప్పడంతో గత నెల లో జరగవలసి కళ్యాణానికి ఆటంకం ఏర్పడింది. ఇకనుండి రహదారి సౌకర్యం కలదు భక్తులకి, పర్యాటక, ప్రియులకి సౌకర్యవంతంగా ఉంటుంది అని ఆలయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదివాసీల ఇలవేల్పు ఆరాధ్య దేవత ముయ్యాలమ్మ తల్లి గుడికి సంబందించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలం ఇవ్వటానికై సర్వే నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సెక్రెటరీ కుమారి, ముక్కెర.సరిత, దేవుడు బాల వుయిక.రాంబాయమ్మ కోరం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: