మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అశ్వాపురం వైద్యాధికారి డాక్టర్ జి అరుణ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 150 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఆధునిక జీవనశైలి మార్పుల వలన వచ్చేటువంటి వ్యాధులు షుగర్ మరియు బీపీ తగ్గించుట కొరకు పాటించవలసిన ఆహార నియమాలను మరియు వ్యాయామము మరియు గృహ వైద్య చిట్కాలను కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమమును గ్రామ సర్పంచ్ కోడి కృష్ణవేణి చేత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో సెక్రటరీ బిందు, ఏఎన్ఎంలు లలిత కుమారి, భవాని. పారామెడికల్ సిబ్బంది రాధిక, ఆశా కార్యకర్తలు సుశీల పూర్ణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: