మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలోని జమ్మిగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకపోడ్లు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగంగా 4వ రోజు గురువారం ఉదయం చంద్ర పట్నం, మైల పట్నం అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య మాట్లాడుతూ చంద్ర పట్నం, మైల పట్నంలు అనగా శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామికి స్నానం చేయించడం జరుగుతుందని, రెండు పర్యాయాలు చంద్ర, మైల పట్నాలు పేరుతో ముగ్గు వేసి స్వామి వారిని అందులో కూర్చోబెట్టి బండారు వేసిన నీలతో స్వామి వారికీ పోయడం జరుగుతుందని, అప్పుడు భక్తులు స్వామి వారిని తాకిని చినుకు వారి పై పడితే అదృష్టంగా భావిస్తారని దాని ద్వారా పుణ్యం దక్కతుందని నమ్ముతారని వారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిద్దిన రాములు, పెద్దలు రాజిని నాగేశ్వరావు, దానపు జగపతి, మిద్దిన రాము, గణప వెంకన్న, మనుబోలు రమేస్, కమిటీ మెంబర్స్ దాది చంటి, గణప చిరంజీవి, పెన్నాడ రవి, మిద్దిన వెంకీ, గ్రామ ఆడపడుచులు, భక్తులు అనేక మంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: