మన్యం టివి దుమ్ముగూడెం::
మండల పరిధిలోని ములకపడు గ్రామం వద్ద ఉన్న శ్రీ సాయిపావని ముకుంద రైస్ మిల్ లో నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. 420 బస్తాల్లో రేషన్ బియ్యం ప్రభుత్వం నిరుపేదలకు అందజేసే బియ్యాన్ని కొందరు వ్యక్తులు సేకరించి భద్రపరచి రవాణాకు సిద్ధం చేస్తూండగా పక్కా సమాచారం ప్రకారం సివిల్ సప్లై అధికారి శ్రీరామ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ సిబ్బందితో కలిసి రైసుమిల్లు పై దాడి చేసి బియ్యం 55 క్వింటాలు నూకలు స్వాధీనం చేసుకొని భద్రాచలం జిసిసి గోడ కు తరలించి ఇన్చార్జి వెంకటరాజం అప్పజెప్పారు. ప్రజల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారని వీటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు తెలిపారు వీటి విలువ 3 లక్షలు ఉంటుందని చేశారు మిల్లు యజమానులు పై సెక్షన్ 17ఏ సప్లై 6-ఏ కేసు నమోదు చేశామని సివిల్ సప్లై అధికారులు తెలియజేశారు ఈ దాడుల్లో దుమ్ముగూడెం తాసిల్దార్ చంద్రశేఖర్ ,అర్ ఐ ఆదినారాయణ, వీఆర్ఏ వెంకటలక్ష్మి ,జయబాబు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: