CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీలు మోటారు సైకిళ్ల పై పర్యటన.

Share it:


 మన్యం టీవీ చర్ల:


చర్ల మండలం అడవిప్రాంతం లో ఈ రోజు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునిల్ దత్ లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. చర్ల మండల కేంద్రం నుంచి మోటారు సైకిళ్ల పై కలెక్టర్, ఎస్పీ సునిల్ దత్ లు అటవీ ప్రాంతంలో పర్యటించారు. 

ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పూసుగుప్ప, ఉంజుపల్లి, ఒద్దిపేట గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. 

సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. 

వేసవి కాలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మంచి నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 

అత్యవసరంగా ఒద్దిపేట లో బోరు బావి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

కొంతమంది మంది తమకు ప్రభుత్వం నుంచి ఫించన్ వచ్చినా బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని తెలిపారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. 

లెనిన్ కాలనీ గ్రామంలో ఐసీడీఎస్ కేంద్రం ను కలెక్టర్ సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. 

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

Share it:

TS

Post A Comment: