- సహాయ కార్యదర్శులు గా గార్లపాటి వీరభద్రం, ఎస్.కె చాంద్ పాషా..
మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 21, సిపిఐ జూలూరుపాడు మండల మహాసభలో జూలూరుపాడు గ్రామానికి చెందిన గుండెపిన్ని వెంకటేశ్వర్లు ను మరోసారి సిపిఐ మండల కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సహాయ కార్యదర్శులు గా గార్లపాటి వీరభద్రం, ఎస్.కె చాంద్ పాషా లను ఎంపిక చేశారు. వీరితో పాటు 19 మంది కార్యవర్గ సభ్యులను 47 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టీని మరింత బలోపేతం చేయడంలో కృషి చేస్తానని, కార్యకర్తల కు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించాలని, నాపై నమ్మకం ఉంచి రెండోసారి మండల కార్యదర్శి గా ఎన్నుకున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: