మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడిచే చండ్రుగొండ, పాతకొత్తగూడెం బాలుర వసతి గృహాల్లో విద్యార్థులు చేరాలని వార్డెన్ సిహెచ్ లక్ష్మణ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... అడ్మిషన్లు ప్రారంభమైనాయని, వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఆధార్ కార్డు, రెండు పాస్ ఫోటోలు జతచేసి దరఖాస్తును వసతిగృహంలో అందజేయాలన్నారు. చండ్రుగొండ లో 60, పాత కొత్తగూడెం లో 70 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Post A Comment: