మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండల పరిధిలోని చింతగుప్ప గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు(45)అలానే తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు(24)మంది 01 తరగతి నుండి 05తరగతి విద్యార్థులకు హనుమకొండ జిల్లాలో ఉన్న మిట్ట కోల సోమక్క- నర్సయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫెసనరీ సామాగ్రి పంపిణీ చేశారు. దుమ్ముగూడెం ఎంపీడీవో మిట్టకోల చంద్రమౌళి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం డి ఆర్ డి ఎ జీ మధుసూదన్ రాజు పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిల్, స్కేల్, బ్యాగులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజెన్సీ గిరిజన విద్యార్థులకు సేవ కార్యక్రమాలనుఅభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, సర్పంచ్ కృష్ణ, ఏ పీ ఓ సుకన్య, ప్రధానోపాధ్యాయులు రవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యాలు,సర్పంచ్ మట్ట శివాజీ, టైపిస్ట్ సాయిబాబా,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: