CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వద్దిరాజు నాయకత్వంలో ఎమ్మెల్యే రాములు నాయక్ కు అండగా మున్నూరు కాపులు..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 21, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, గాయత్రి గ్రానైట్స్ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నాయకత్వంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కి అండగా మున్నూరు కాపులు నిల్వనున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘ నాయకులు బాపట్ల మురళి అన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ను ఖమ్మం లోని వారి స్వగృహంలో కలిసి మంగళవారం ఉదయం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ గారితో మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( గాయత్రి రవి) నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో తిరిగి ఎమ్మెల్యేగా లావుడియా రాములు నాయక్ ని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదేశాల మేరకు మున్నూరు కాపులు ఎమ్మెల్యే రాములు నాయక్ కి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గాయత్రి రవి కి రాజ్యసభ పదవి ఇచ్చి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి లక్ష్యం అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు శక్తివంచన లేకుండా మున్నూరు కాపులు పాటుపడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌడం నర్సింహారావు, రామిశెట్టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: