గుండాల జూన్ 6(మన్యం మనుగడ) ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ అన్నారు. సోమవారం బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరితే విద్యార్థికి సరిపడా అన్ని వస్తువులు ఉచితంగానే అందిస్తున్నామని ఆయన అన్నారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులు, కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఫీజుల భారాన్ని మాయ వద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: