CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి... మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి, వెంకటరమణ, రాజేశ్వరి డిమాండ్..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

హైదరాబాదులో పబ్ లో 17 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను శిక్షించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా మండల నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి, పోడియం వెంకటరమణ, వాగే రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి, రాష్ట్ర డిజిపి కి విజ్ఞప్తి చేశారు అత్యాచారం జరిగే 7రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఆంతర్యమేమిటో ప్రభుత్వం చెప్పాలని, మైనర్ బాలిక న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, అలానే అత్యాచారం చేసిన నిందితుడు వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస రావు మాజీ అధ్యక్షులు బైరెడ్డి సీతారామారావు సీనియర్ నాయకులు అప్పల్ రెడ్డి, యూత్ నాయకులు కనుబుద్ది దేవా, కోడి చంటి, తెల్లం నరేష్, హరికృష్ణ, రాఘవ, పాయం తిరుపతి రావు, మారయ్య తదితరు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: