దమ్మపేట జూన్ 06 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం.BKMU. దమ్మపేట మండలం సమితి ఆధ్వర్యంలో దమ్మపేట తాసిల్దారు రంగ ప్రసాద్ గారికి మెమోరాండం ధర్నా. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కృష్ణవేణి,సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు, బత్తుల సాయి,సుంకుపాక ధర్మ మాట్లాడుతూ. వ్యవసాయ కార్మికులు దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారికి పని కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తక్షణం ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని 600 వేతనం ఇవ్వాలని ప్రతి మనిషికి జాబ్ కార్డు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు 57 సంవత్సరాలు నిండిన వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 7500 ఇవ్వాలని ఇల్లు లేని నిరుపేదలు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఆరు లక్షలు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని తక్షణం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరినారు ఈ కార్యక్రమంలో కుంజా కృష్ణవేణి జాన్ బి నక్క నాగమణి వేగ్గిలం దుర్గారావు పండూరి కిరణ్ డొక్కా గోపి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: