- తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే నని ధీమా వ్యక్తం చేసిన జెడ్పిటిసి నాగమణి
ములకలపల్లి:(జూన్ 15)మన్యం మనుగడ ప్రతినిధి:
మండలం కేంద్రం లొ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకులు ప్రతిపక్ష నేత మల్లుభట్టివిక్రమార్క జన్మదినం వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తాండ్ర ప్రభాకర్రావు అధ్యక్షతన,ములకలపల్లి జెడ్పీటీసి సున్నం నాగమణి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెటేటి నర్సింహారవు పలువురు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లొ ఇచ్చిన హామీలు, అయన చేస్తున్నా పాదయాత్ర విజయవంతం అవ్వాలని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అశ్వారావు పేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరంపల్లి చెన్నారావు,మండల ఒబిసి అధ్యక్షుడు పుష్పాల హనుమంతు,అర్చన వెంకటేశ్వరరావు మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు,పామర్తి కృష్ణారావు, బుగ్గారపు సత్యనారాయణ,ఎస్ కె ఖాదర్ బాబా,బూరుగుపల్లి పద్మశ్రీ,కొప్పుల రాంబాబు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అధ్యక్షుడు పాలకుర్తి రవి,పిడియాల వెంకటేశ్వరరావు,కుంజా వెంకట్, చిడిపి భాను,కోండ్రు రవి భాస్కర్,మడకం శ్రీను,వనమా వెంకటేశ్వరరావు,పలగాని శోభనాద్రి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: