గుండాల జూన్ 10(మన్యం మనుగడ) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బి ఎస్ పి బలోపేతం అవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు అన్నారు. శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నియమించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తొలిసారిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా శంషాబాద్ నుండి సభ కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో బి ఎస్ పి విజయం సాధించడం ఖాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్, మోహన్ రావు, ముత్తయ్య, వెంకన్న, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: