మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయరహదారి పై రాస్తోరోకో చేసిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలొ ఆమె మాట్లాడుతు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జాతీయరహదారి పై గురువారం రాస్తోరోకో చేసిన 20 మందిపై కేసు నమోదు చేయటం జరిగిందన్నారు. పేదవారిని ఆందోళనలు చేయటం కోసం ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘతం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Post A Comment: