మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామానికి చెందిన కారం రమేష్ పద్మ దంపతులు ప్రస్తుతం గంగోలు గ్రామం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ 01 నివాసముంటున్నారు ఇరువురికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగి ఉన్నారు. గత కొన్ని నెలలుగా భార్య, భర్త అయిన రమేష్, పద్మాల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి భార్య ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి రమేష్ తో అనుమానంతో గొడవ పడేదని, ఈ క్రమంలో ఈరోజు కూడా గొడవ జరిగి ఉదయం 9 గంటల సమయంలో పురుగుల మందు తాగింది బంధువులు గమనించి భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 01 గంటకు చనిపోయిందని చిన్న విషయానికి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినని మృతురాలి తల్లి కనకమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Post A Comment: