CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ మండలమైన గుండాల లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి.

Share it:

 


గుండాల జూన్ 7(మన్యం మనుగడ) ఏజెన్సీ, ఆదివాసి మండలమైన గుండాల మండలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పి డి ఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులతో కూడిన బృందం మండలంలోని పల్లెపల్లెకు తిరుగుతూ ప్రచారం చేస్తుంది. మంగళవారం మండలం పరిధిలోని ముత్త పురం, దేవల్ల గూడెం, పెద్ద తోగు, రోళ్లగడ్డ, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం పి డి ఎస్ యు అధ్యక్ష కార్యదర్శులు, కారం సంధ్య, పృథ్వీ లు మాట్లాడుతూ గ్రామాల్లోని ఆదివాసి, సామాజిక, ఆర్థిక, పరిస్థితులు దయనీయంగా ఉంటాయని, ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చదివించే స్థితికి ఇంకా ఎదగ నందున ప్రతి పాఠశాలలో ప్రభుత్వం మెరుగైన విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నందున పిల్లలకు సరైన విద్య అందటం లేదు అన్నారు. ఏజెన్సీలు మెరుగైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంధా నాయకులు శంకర్, కొమరం శాంతయ్య, జగన్, గణేష్ , పూనెం మంగయ్య, పి డి ఎస్ యు నాయకులు శ్వేత, మీనా, మేనక, నందిని, వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: