CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బంగారు తెలంగాణలో దళిత బంధు దళిత బంధు పథకం తో దళితుల జీవితాల్లో నూతన వెలుగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ, కొత్తగూడెం:  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలం మహేంద్ర షోరూమ్ నందు దళిత బంధు పథకం ద్వారా పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎస్ సి సెల్ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ కి మంజూరైన ట్రాక్టర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రారంభించారు. దళితుల ఆర్థిక ప్రగతే దళిత బంధు లక్ష్యం అని రేగా కాంతారావు తెలియజేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారు అని అన్నారు.అన్ని వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అని ఆయన అన్నారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదని ఏ పాలకుడికి ఈ ఆలోచన తట్టలేదని అన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు, విడతలవారీగా ప్రతి ఒక్కరికి దళిత కుటుంబానికి దళిత అందుతుందన్నారు, దళిత బందుతో దళిత ల జీవితాల్లో వెలుగులు నిండాలని అన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రు.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. అలా అందించిన ప్రభుత్వ సహకారంతో 30 రకాల వివిధ వ్యాపారాలను చేసుకుని జీవితంలో ఎదగాలనే సంకల్పంతో తోడ్పాటు ను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: