మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నారు. గురువారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భానోత్ పార్వతి, మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వర్స రవికుమార్, తెలంగాణ దిమ్మె వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, రైతు వేదికలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ గాదె లింగయ్యలు జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: