CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ తల్లి సాక్షిగా జండా ఎగరవేశారు. జై తెలంగాణ నినాదం తో క్యాంపు కార్యాలయ ఆవరణం నూతన అలంకరణలతో సందడి చేసింది. అశ్వరావుపేట రింగ్ రోడ్డు నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జెండా ఎగురవేసి తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. తదుపరి అశ్వారావుపేట రింగ్ రోడ్డు కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సమావేశమైన నాయకులను, పలువురు కార్యకర్తలను, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నో ఏళ్ళ నుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్దే మన ధ్యేయం అంటూ ఉత్సాహాన్ని పురికొల్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు పలువురు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: