మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన అనంతుల వర్షిత ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన సందర్బంగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ వర్షితకు అభినందనలు తెలియజేసి తన చేతుల మీదుగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ప్రతిభాశీలి అవార్డు ను అందజేశారు. ఈ సందర్బంగా బాడిశ నాగ రమేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ కాలేజీ లో విద్యను అభ్యసించిన ఆనంతుల వర్షిత కార్పొరేట్ కాలేజీలతో చదువులతో పోటీ పడి మరి మంచి మార్కులు తెచ్చుకొని గురువుల, తల్లి తండ్రుల పేరు నిలబెట్టింది, వర్షిత సాక్షాత్తు సరస్వతి పుత్రిక అని తాను ఇంకా పై చదువులు ఇలాగే కొన సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
Post A Comment: