CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.రోజు రోజుకీ ప్రజలలో పెరుగుతున్న ఆదరణ

Share it:

 


జూలూరుపాడు జూన్ 30, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిదిలోని బేతాళపాడు, పంతులు తండా, పీక్లా తండా, చీపురుగూడెం గ్రామాలకు చెందిన సుమారు 250 మంది గురువారం, తెరాస, బిజెపి, పలు పార్టీలను వీడి, వైరా నియోజకవర్గ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గత కొన్నేళ్లుగా పలు పార్టీలలో కొనసాగుతున్న వీరు, అభివృద్ధి, హామీలు అమలు కావడం లేదంటూ కారు, బిజెపి. దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా కొత్త పెన్షన్లకు నోచుకోని వారికి, అర్హులైన వారందరికీ పెన్షన్లు, ఇళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాగీలాల్, ఆయకులు, రాంబాబు, బొడ్డు కృష్ణయ్య, నున్న కృష్ణయ్య, మంద బాబు, నాయకులు మరియు, బానోత్ సురేష్ ఆధ్వర్యంలో 250 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Share it:

TS

Post A Comment: