CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్.టీఆర్ఎస్ లో చేరిన నలుగురు జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్*

Share it:


మన్యం టీవీ వెబ్ డెస్క్:


హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.బీజేపీ కి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు,తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్,రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్,జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్,అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు.


ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా,మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ రానుండగా,సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్.


ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్,దానం నాగేందర్,పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి,ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: