నిన్న చర్ల పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా ఒక కారును ఆపి తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
వారి వద్ద నుంచి 5 లక్షల 15 వేల విలువచేసే దొంగ నోట్లతో సహా ఒక కంప్యూటర్,ప్రింటర్ మరియు CPU స్వాధీనం..
వీరంతా గుంటూరు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు..
ఈ దొంగనోట్ల ముఠాకు చర్ల మండలం లో సహకరిస్తున్న కొందరు వ్యక్తులను కూడా అరెస్టు చేసిన పోలీసులు.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని గత కొద్ది కాలంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా.
దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకొని దొంగ నోట్లు ముద్రించే పరికరాలను మరియు ఒక కారు సీజ్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
Post A Comment: