గుండాల జూన్ 12(మన్యం మనుగడ) మండలం పరిధిలోని తూరు బాకా గ్రామంలో సాయంత్రం వచ్చిన అకాల వర్షం గాలి దుమారానికి ఎస్ కే బాజీ కి చెందిన రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంటి పై కప్పు ఎగిరి పోవడంతో ఇంటిలోని వస్తువులన్నీ వర్షానికి కరవయ్యాయి విషయం తెలుసుకున్న గుండాల ఎం పి టి సి సంధాని ఇంటిని పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అయినందున బాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఉండేందుకు నీడ కూడా లేని విధంగా గాలివానకు ఇల్లు ధ్వంసం అయింది అన్నారు. ఆర్థిక సహాయం అందించి బాజీ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: