మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జగ్గారం గ్రామానికి చెందిన సల్లూరి సందీప్(22) శుక్రవారం నాడు భూపతి రావు పేట నుండి గోదావరిలో కాలిరేవు దాటుతుండగా, గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పినపాక మండల తాహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎస్ ఐ టి వి ఆర్ సూరి ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో చింతల బయ్యారం గోదావరిలో మృత దేహాన్ని గుర్తించడం జరిగింది. ఈ సంఘటనతో జగ్గారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post A Comment: