మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాచలం పట్టణం లోని గ్రీన్ భద్రాద్రి టీం వేసిన చెట్లకు ఈరోజు ట్రాక్టర్ ద్వారా నీళ్లు పోయటం జరిగింది. ఎండల తీవ్రత బాగా ఉన్నందు వలన రోజుకు రెండు సార్లు ట్రాక్టర్ ద్వారా చెట్లకు నీటిని పోయటం జరిగింది. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ముందు ఉన్న చెట్లకు ప్రతీ రోజు నీటిని పోసి ఎండ తీవ్రతని తగ్గింది చల్లని గాలిని ఇచ్చే చెట్లను పెంచాలని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమానానికి ముఖ్య అతిధిగా గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు గాదె మాధవ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం గ్రీన్ భద్రాద్రి టీం చాలా చక్కగా ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మొక్కలు నాటారని, అదేవిధంగా నాటిన మొక్కల సంరక్షణ లో భాగంగా క్రమం తప్పకుండా వాటికి పాదులు తీసి యూరియా వంటి పోషక మందులు వేసి మొక్కలు త్వరగా పెరగటానికి తగు చర్యలు చేపట్టారు, మొన్న వచ్చిన భారి వర్షానికి పడిపోయిన చెట్లను కూడా చాలా శ్రద్ధ తీసుకొని దగ్గర ఉండి వాటిని నిలబెట్టి వాటికి పెన్సింగ్ కట్టారని గ్రీన్ భద్రాద్రి టీం అందర్నీ అభినదించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి,P.R.O. కడాలి నాగరాజు, లక్ష్మణ్, రాసమల్ల రాము, RK నాయుడు పాల్గొన్నారు.
Post A Comment: