CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంగర్చుల పర్వతారోకులను అభినందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలానికి చెందిన ఇరువురు పంగర్చుల పర్వతారోహణ అధిరోహించిన యువకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అభినందించి శాలువా తో సత్కరించారు. దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామపంచాయతీ భీమవరానికి చెందిన అపాక అరుణ్ సాగర్, అంజుబక గ్రామానికి చెందిన సరియం చందు లు హిమాలయ పర్వత శ్రేణి ఉత్తరాఖండ్ రాష్ట్రం జోషిమాట్ ప్రాంతంలోని పంగర్చుల పర్వతారోహణ ని 14,700 ఎత్తు గల పర్వతం జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఇద్దరు ఆదివాసి యువకులు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను మరియు యువతరానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఇంకా ఎన్నో పర్వతాలు అధిరోహించాలని దానికి నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: