మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: అంగనవాడి కేంద్రాల పరిధిలో గల బరువు తక్కువ పిల్లలను గుర్తించి పౌష్టిక ఆహారాన్ని అందించాలని డి డబ్ల్యు ఓ ( జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి) వరలక్ష్మి అన్నారు.శుక్రవారం అయ్యన్నపాలెంలో గల రైతు వేదిక భవనం లో జరిగిన సెక్టార్ పరిధిలోగల అంగన్వాడిలా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. తొలుత ఆమె పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్ వాడి కేంద్రం నుండి వెళ్లే ప్రతి చిన్నారికి ప్రీస్కూల్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కొత్తగా వచ్చిన బాలామృతం ప్యాకెట్ లో అన్ని రకాల పౌష్టికాహారాలు అందించడం జరుగుతుందని, ఈ ప్యాకెట్ ను అత్యంత బరువు తక్కువ ఉన్న చిన్నారులకు మాత్రమే ఇవ్వాలన్నారు. ఆరు నెలల లోపు బాలింతలకు తల్లిపాలు గురించి అవగాహన కల్పించాలన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సి డి పి ఓ నిర్మల జ్యోతి, ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు శకుంతల, అరుణ, లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: