CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుంతల బాధలు తప్పేను..దశాబ్దాల బాధలు తిరేను.ఆళ్లపల్లి నుండి..రాయి పాడు వరకు బీటి రోడ్డు నిర్మాణం

Share it:

 


  • విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కృషి తో నెరవేరిన దశాబ్దాల కల
  • నాడు అలా.. నేడు ఇలా
  • విప్ రేగా కృషితో బిటి రోడ్డు పనులు ప్రారంభం
  • సంతోషం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు

గుండాల/ఆళ్ల పల్లి 10(మన్యం మనుగడ) నాడు గుంతల మయంగా ఉన్నా రహదారి నేడు బిటి రోడ్డు వేయడంతో ప్రయాణానికి సౌకర్యవంతంగా మారింది. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో మరో రెండు రోజుల్లో పదిహేను కిలోమీటర్లు బీటీ రోడ్డు పూర్తి కానుంది. ఆళ్లపల్లి నుండి రాయి పాడు వరకు రహదారి పూర్తిగా గుంతల మయం కావడంతో కొత్తగూడెం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు దీన్ని గమనించిన ప్రభుత్వం పదిహేను కిలోమీటర్లు రహదారిని మంజూరు చేయించి త్వరగా పనులు ప్రారంభించి పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు అనంతోగు వరకు పూర్తి కాగా మరో రెండు రోజుల్లో రాయి పాడువరకు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికుల కష్టాలను గమనించి రహదారి పనులను పూర్తి చేయించినందుకు రేగా కాంతారావు కు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: