మన్యం మనుగడ, మంగపేట.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఇంటర్మీడియట్ పరిక్షా ఫలితాలు విడుదల చేసిన సందర్బంగా తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లో ములుగు జిల్లా ప్రధమ సంవత్సరంలో 70% తో 5 స్థానం లో, ద్వితీయ సంవత్సరం లో 71%తో 6 వ, స్థానం నిలవడం గర్వించదగ్గ విషయం అని, ఇదే విదంగా ఉన్నత చదువులలో కూడా విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తద్వారా మన జిల్లాకు, మీ తల్లి తండ్రులకు,గురువులకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి, ఉత్తీర్ణత సాధించిన వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైనా కారణాల వలన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని వారుకూడా మంచిగా చదివి సప్లిమెంటరీ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ కావాలని సూచనలు చేశారు. ములుగు జిల్లాలో కార్పొరేట్,ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు ఉత్తమ ఫలితాలు సాధించారని, ఇటువంటి ఉత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించటానికి తోడ్పాటు అందించిన అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు.
Post A Comment: