మన్యం టీవీ దుమ్ముగూడెం ::
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ ఎల్. వెంకటేశ్వర్లు తెలియజేశారు. మొదటి సంవత్సరం 119 మంది పరీక్ష రాయగా 106 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 175 మంది పరీక్ష రాయగా 163 మంది ఉత్తీర్ణులయ్యారు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో పూనెం దీపిక బైపిసి 1000 గాను 943 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, రామినేని యశ్విత యం పి సి 942 మార్కులతో రెండొవ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో లో ఎడ్ల గాయత్రి 929 మార్కులు సాధించింది. ప్రథమ సంవత్సరంలో ఎంపిసి విభాగంలో కొండ సాయి తేజ 470 కి మార్కులు 459 మార్కులతో మొదటి స్థానంలో, నిలవగా యువ శ్రీ కృష్ణ సాయి 456 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు మొదటి సంవత్సరం లో 89./. ద్వితీయ సంవత్సరం లో 93./.ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ కళాశాల అధ్యాపక బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: