CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యారంగం లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ ఎప్ ఐ ఆధ్వర్యంలో డిమాండ్..

Share it:



మన్యం మనుగడ మంగపేట.


విద్యారంగం లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ ఆద్వరం లో మంగపేట మండలం రాజపేట ప్రభుత్వ పాఠశాల ను సర్వే లో భాగంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ  ములుగు జిల్లా కన్వీనర్ టి.రవి మాట్లాడుతూ,పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు  గడిచినా కానీ పాఠశాలలో త్రాగ టానికి  నీళ్లు లేని పరిస్థితి ఉంది,పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు,ఇంకా ఇవ్వని పరిస్థితి నెలకొంది. తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయడం లేదు,కొన్ని రూములకు ఫ్యాన్ సౌకర్యం లేదు,బాతు రూముల శుభ్రత లేదు,ఎక్కడ చూసిన అపరిశుభ్రత నెలకొని ఉంది అన్నారు.తరగతి గది వరండాలో నాపరాళ్లు పగిలి ఉండటం వలన విద్యార్థులు కింద పడి గాయాలు అయ్యే పరిస్థితి వుంది.ప్రహరి గోడ శిధిలావస్థలో లోకి చేరింది అని, రాజుపేట ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియెడల యస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో దశల వారిగా పోరాటాలు చేస్తామని ఈ సందర్బంగా హెచ్చరరించారు.

ఈ కార్యక్రమంలో యస్ ఎఫ్ ఐ మంగపేట మండల నాయకులు పూస అరవింద్,వి,సిద్దు, నాగేంద్రబాబు,మురళి,చరణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: