గుండాల జూన్ 28(మన్యం మనుగడ) ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు మొత్తం 115 మంది పరీక్ష రాయగా 79 మంది ఉత్తీర్ణత లయ్యారు 68% ఫలితాలు రావడంతో కళాశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం చెందిన మొక్క రాణి ఇంటర్మీడియట్ ఎంపీసీ లో 930 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం సూర్య ప్రకాష్ బైపీసీలో 892 మార్పులను సాధించారు వీరితో పాటు నాగరాణి ఇ సి సి770, సుచరిత హెచ్ ఈ సి769, మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల సత్తాను నిరూపించారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం ఉత్తమ ప్రతిభ కరపరిచి అత్యధికంగా మార్పులు సాధించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యను బోధించడం జరుగుతుందని ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు ప్రభుత్వ కళాశాల లో చేరాలని కోరారు.
Navigation
Post A Comment: