- ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ హరికృష్ణ
గుండాల జూన్ 28(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటి ముందు నిలిచారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి పొల్ల నరేష్ ఎంపీసీ లో969 మార్కులు సాధించి ముందు నిలిచారు. అదే కళాశాలకు చెందిన బోడ వెంకటేష్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 449 మార్కులు సాధించారు. గురుకుల కళాశాల రెండో సంవత్సరం విద్యార్థులు 102 మంది రాయగా 74 మంది పాసయ్యారు 73% ఉత్తీర్ణత సాధించింది. మొదటి సంవత్సరంలో విద్యార్థులు 107 మంది పరీక్ష రాయగా74 మంది విద్యార్థులకు పాసై కళాశాల సత్తాను నిరూపించారు. అనంతరం ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ కళాశాలలో ఉత్తమ ఫలితాలు రావడం ఆనందంగా ఉందని విద్యార్థులు గురుకుల కళాశాలలో చదివేందుకు చూపాలని కోరారు.
Post A Comment: