- బోడయి కుంట, నడిగూడెం గ్రామాల మధ్య కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
గుండాల/ ఆళ్లపల్లి జూన్ 28(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో తొలకరి వానకు వాగులు ఉప్పొంగాయి. కిన్నెరసాని, జల్లేరు వాగులు ఉదృతంగా ప్రవహించడంతో ప్రయాణికులకు కొంతమేర అసౌకర్యం ఏర్పడింది చిన్న పిల్లలు ఉన్నవారు వాగు దాటాలంటే ఇబ్బందులకు గురయ్యారు. బొడయికుంట, నడిగూడెం గ్రామాలకు వెళ్లే తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలకు కొంత సేపు ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయి.
Post A Comment: