మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం లో సింగవరం, నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ క్రీడా వేదికలను ను నేడు ప్రారంభించారు. పల్లెల్లో యువకులు వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్రామీణ క్రీడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడంతో మండల అధికారులు ముందుగా సింగవరం నరసాపురం గ్రామం లో ఏర్పాటు చేశారు. మండల అధికారులు ఈ క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడంలో కలెక్టర్ ఆదేశాల మేరకు క్రీడాపోటీలను అనుకూలంగా ఉండే స్థలం సేకరించి ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే భవిష్యత్ తారలు ఎంతో మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడాప్రాంగణం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీవో ముత్యాలరావు, ఏ పీ ఓ సుకన్య, కార్యదర్శులు కార్తీక్, యాకూబ్, సర్పంచ్ కొండయ్య, శివరామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కనితి రాముడు, గ్రామీణ యువత తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: