CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు.. ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపిపి రేస్ లక్ష్మి...

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం తాసిల్దార్, ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన 8 సంవత్సరాలు పూర్తి అయిందని తెలంగాణ నీళ్లు నిధులు కొరత లేకుండా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో చంద్రశేఖర రావు జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అమరుల ప్రాణ త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండల ప్రజలందరికీ తెలంగాణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సీతమ్మ, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, ఏపీవో సుకన్య, ఆర్ ఐ ఆదినారాయణ, వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాముడు, ఎం పి టి సి భీమ్ రాజు, రత్నాకర్, సీత, కార్యదర్శులు, వీఆర్ఏలు, జయ బాబు, గణేష్,సాయిబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: