మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల లోని విద్యార్థులకు బ్యాగులు, దుప్పట్లు, యూనిఫామ్స్, పుస్తకాలను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల చదువు కొరకు, సకల సదుపాయాలను కల్పిస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గడ్డం పల్లి సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్, ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ,ఉపాధ్యాయురాల్లు ఉమాదేవి, మహాలక్ష్మి, జ్యోతి, వెంకటేశ్వర్లు, సౌమ్య, శివ, బాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: