మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని గంపోనిగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తురక సదయ్య ,స్వరూప దంపతుల కుమారుడు మణి శంకర్ ఇటీవల(19-06-2022 నాడు)ఇంటిదగ్గర ఆటలాడుకుంటుండంగా ప్రమాదవశాత్తు ఇంటి ప్రహరీగోడ కూలి గేటు మీద పడగా బాలుడు తలకు తీవ్రంగా గాయమైంది. తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడం వలన వైద్యానికి సరిపడ డబ్బు లేకపోవడంతో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి స్థానికులు తెలపడంతో , ఋదవారం నాడు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ బృందం వారి ఇంటి వద్దకు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి, తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని బాలుని తల్లిదండ్రులకి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నవీన్, ముయబోయిన శివ, రామ్మోహన్ ,జాడి నరేందర్ మరియు స్థానికులు లొంక వెంకటేష్, చల్లా లోకేష్ ,గుగ్గిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: