గుండాల/ఆళ్లపల్లి జూన్4(మన్యం మనుగడ) పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని కొత్తగూడెం జిల్లా చైర్మన్ కోరం కనకయ్య అధికారులకు సూచించారు. శనివారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన మండలంలోని ప్రతి పల్లెలో పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.ఆళ్లపల్లి, రాఘవాపురం, మర్కోడు పంచాయతీలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. డంపింగ్ యార్డ్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీలను ఆయన పరిశీలించారు. హరితహారం ఈ కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్క బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మండలంలోని పత్తి పంచాయతీలో కంపోస్ట్ ఎరువు తయారుచేసి విక్రయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, ఎంపీడీవో మంగమ్మ, సర్పంచ్ శంకర్ బాబు, రాఘవాపురం సర్పంచ్ ప్రేమ కళ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, అధికారులు,టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: