మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామానికి చెందిన పెన్నాడ రామకృష్ణ (దత్తు) మానవత్వం చాటుకున్నారు. అశ్వరావుపేట పట్టణంలో గల అమ్మ సేవాసదన్ వృద్ధాశ్రమానికి సీసీ కెమెరా అవసరమని బాద్యులు తెలపగా పెన్నాడ దత్తు ఒక సీసీ కెమెరాని కొనుగోలు చేసి ఆశ్రమ నిర్వాహకురాలు పసుపులేటి అనసూర్యకు అందజేసి వారు ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లు సంపాదించిన దొరికిన తృప్తి సమాజసేవలో దొరుకుతుందని సహాయం చేయడంలో తనకు సంతృప్తి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురిసెట్టి నాగబాబు, తిరుమల శెట్టి అప్పారావు, కొల్లు రమేష్, మనోజ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: