గుండాల జూన్ 13(మన్యం మనుగడ) ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు మారం ఉన్నాయని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన మన ఊరు మన బడి కార్యక్రమాల్లో భాగంగా ఆధునీకరించి పడుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడం కోసం ఏడు వేల కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేసిందన్నారు మొదటి విడతగా రాష్ట్రంలో కొన్ని బడులను ఆధునిక పడతాయని అన్నారు. రానున్న విద్యా సంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకటి నుండి పదో తరగతి వరకు పూర్తిగా ఆంగ్ల భాషలో విద్యాబోధన ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చెబుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జలగం ట్రస్ట్ చైర్మన్ జలగం ప్రసాదరావు, జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ సత్యం, సర్పంచ్ సీతారాములు, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, ఎంఈఓ కృష్ణయ్య, ఎంపీటీసీ సంధాని, కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్, ప్రధానోపాధ్యాయురాలు నారాయణమ్మ, టిఆర్ఎస్ నాయకులు రాంబాబు, మండల అధ్యక్షులు భాస్కర్, మండల నాయకులు వీరస్వామి, అబ్దుల్ నబీ, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: