మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం బండారు గూడెం ప్రాథమిక పాఠశాలలో లో బడి బాట కార్యక్రమంలో భాగంగా 3తరగతి నుండి 7తరగతి పిల్లలకు పెద్దబాలశిక్ష పుస్తకాలను గ్రామ సర్పంచ్ చిన్న వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసురావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పెద్ద బాలశిక్ష పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈకార్యక్రమం ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ మన ఊరు మన బడి లో భాగంగా మన పాఠశాల ఎంపికవడం జరిగిందని ఈ సంవత్సరం మన పాఠశాల తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నామని అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కుంజా నాగేశ్వరావు, పాఠశాల ఉపాధ్యాయులు ఏవి సీతారం, టి వంశీ మోహన్, జి రవి, ఎం సరోజిని, ఆయా తిరుపతమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: