మన్యం మనుగడ వాజేడు:
సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు గానూ ప్రతీ సంవత్సరం నిర్వహించే బడిబాట కార్యక్రమానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో మండల పరిషత్ విద్యాధికారి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కుర్సం. అనంత ఉపసర్పచ్ సత్యనారాయణ,పంచాయతీ కార్యదర్శి,వార్డు సభ్యులు,ఉపాద్యాయులు, పాఠశాల చైర్మన్ ఎట్టి. కళ్యాణ్ బాబు అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: