మన్యం టీవీ మణుగూరు:
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లోని కట్టుమల్లారం, లంకమల్లారం,తోగ్గుడెం పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో జెడ్పీటిసి పొశం.నరసింహారావు ఎంపీపీ కారం.విజయకుమారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ,పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ,మొక్కలు నాటే స్థలాల గుర్తింపు,క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన అంశాలు అని,నీరు,విద్యుత్తు సౌకర్యం లేని వైకుంఠధామాలకు వెంటనే ఆ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమంలో రోజు రోడ్లను,మురుగు కాలువలను శుభ్రపరచాలి అని,పల్లె ప్రగతి జరిగే అన్ని రోజులు ఇండ్ల నుంచి మురుగు నీరు రాకుండా,నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడాన్ని ప్రోత్సహించాలి అని వారు తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,తహసీల్దార్ నాగరాజు,ఎండిఓ వీరబాబు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, మండల స్పెషల్ ఆఫీసర్ రమాదేవి,సర్పంచ్ లు బొగ్గం రజిత,జ్యోతి,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యంబాబు,కార్యదర్శి రామిరెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: