మన్యం టీవీ దుమ్ముగూడెం ::
నిన్న ప్రకటించిన తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చెందిన కొండ . సాయి తేజ ఎంపీసీ గ్రూప్ నందు 470 మార్కులకుగాను 459 మార్కులు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల తరపున ప్రథమస్థానం పొందినందుకు జిల్లా కలెక్టర్ దురిశెట్టి. అనుదీప్ గారి చేతుల మీదుగా సాయితేజకు మరియు వారి తల్లిదండ్రులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డిఐఈఓ బి. సులోచన రాణి, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. వెంకటేశ్వర్లు అధ్యాపకులు వినయ్ కుమార్, శ్రీనివాసరావు , నందికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన ఆణిముత్యాలుగా కలెక్టర్ విద్యార్థులను అభినందించారు భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు..
Post A Comment: